కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

చెన్నైకి తాగునీరు అందించే అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహణ. భేటీకి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు ఇంజినీర్లు హాజరయ్యారు. చెన్నైకి కృష్ణా జలాల విడుదలపై అధికారులు సమావేశంలో చర్చిస్తున్నారు. తమకు ఇప్పటి వరకు 5.2 టీఎంసీలు అందాయని తెలిపిన తమిళనాడు ఇంజినీర్లు శ్రీశైలం, కండలేరులో నీళ్లున్నందున తమకు నీరివ్వాల్సిందిగా కోరుతున్నారు.