ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉందో...ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేం. సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశబ్ధాల కల.. సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన అందరికీ కృతజ్ఞతలు. సమైక్యరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండే. లక్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన అపురూప ఘట్టాన్ని కరోనా వల్ల నిరాడంబరంగా జరుపుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయింది. కేసీఆర్ కల సాకారమైంది.ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ పనితీరు కు గొప్ప నిదర్శనం. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ త్యాగాలు మరువలేనివి. త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు.